ఆలయ ఉద్యోగ, అర్చకులకు వరాలు కురిపించిన... సీఎం

SMTV Desk 2017-09-15 17:28:07  CM KCR, temple employees, Pay scale

హైదరాబాద్, సెప్టెంబర్ 15 : తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాల అర్చకులకు, ఆలయ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. రానున్న నవంబర్ నుంచి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే వీరికి కూడా పే స్కేల్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అర్చకుల సమస్యలు, వేతనాల పెంపు చెల్లింపులపై ప్రగతి భవన్ లో సమావేశమైన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేవాలయ నిర్వహణ, అర్చకుల వేతనాలు వంటి అంశాల పర్యవేక్షణకు ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మరో మూడు వేల ఆలయాలకు ధూప, దీప, నైవేద్య పథకం వర్తింప చేస్తామని పేర్కొన్నారు. ఇకపై 5,625 మంది అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ప్రతి నెల 1న వేతనాలు అందజేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.