న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15 : కేంద్ర ప్రభుత్వం ఇటీవల అన్ని రకాల అనుమతులకు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బ్యాంక్ అకౌంట్స్, పాన్ కార్డ్, మొబైల్ సిమ్ కార్డులకు ఆధార్ కార్డును అనుసంధాన౦ చేసుకోవాలంటూ ఉత్తర్వులను జారీ చేసింది. అయితే తాజాగా ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కు కూడా ఆధార్ కార్డును అనుసంధానించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. త్వరలోనే ఈ ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఇప్పటికే ఈ విషయం గురించి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించినట్టు ఆయన వెల్లడించారు.