హైదరాబాద్, సెప్టెంబర్ 15: జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నారు. ఇటీవలే జన్మదిన వేడుకలు జరుపుకున్న పవన్ తన ట్విట్టర్ ఖాతాలో అభిమానుల సంఖ్య రెండు మిలియన్లకు చేరడంతో దీనిపై ఆయన స్పందిస్తూ..... అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా "మూడేళ్ల క్రితం జనసేన ప్రయాణం మొదలుపెట్టినప్పుడు దారంతా గోతులు, చేతిలో దీపం లేదు. ధైర్యమే కవచంగా ఒకే గొంతుకతో మొదలుపెట్టాను. నేను స్పందించిన ప్రతి సమస్యకి మేమున్నామంటూ ప్రతిస్పందించి ఈరోజు ఇరవై లక్షల దీపాలతో దారంతా వెలిగించిన మీ అభిమానానికి శిరస్సు వంచి కృతజ్ఞతలతో మీ పవన్కల్యాణ్"అంటూ ట్వీట్ చేశారు పవన్. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో అభిమానులను మరితంగా ఉత్తేజపరుస్తున్నాయి.