గణేష్ మండప నిర్వాహకులకు ముంబై ప్రభుత్వం భారీ జరిమానా..

SMTV Desk 2017-09-14 15:31:24  Ganesh celebrations, Roads, Mumbai

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14 : ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా గణేష్ ఉత్సవాలను ముంబై నగరం ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, వినాయక మండపాల ఏర్పాటు నిమిత్తం నియమనిబంధనలను సరిగా పాటించకపోవడంపై బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మండిపడుతోంది. గణేష్ మండపాల ఏర్పాటుకు ఎవరి ఇష్టానుసారం వారు గుంటలు తవ్వి రహదారులను పాడు చేశారని ఆయా మండపాల నిర్వాహకులకు జరిమానా విధించడం జరిగింది. ఈ మేరకు ముంబైలో ప్రఖ్యాతి గాంచిన లాల్ బాగ్చా రాజా సార్వజనిక గణేషోత్సవ మండపం, ముంబై రాజా మండపాలకు భారీగా జరిమానా విధించింది. లాల్ బాగ్చా గణేషోత్సవ మండపానికి రూ.4.86 లక్షలు, ముంబైచా రాజా మండపానికి రూ.4.14 లక్షలు కట్టాల్సిందిగా ఆదేశించింది.