సుష్మాస్వరాజ్ ను పొగడ్తలతో ముంచెత్తిన నెటిజన్లు

SMTV Desk 2017-09-14 13:55:50  

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14 : దేశ విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్‌ పై నెటిజన్ల ప్రశంస జల్లులు... ఒక్క చిన్న విమర్శ వినిపించిన దాన్ని వెంటనే తెలివితో విమర్శించడం ఆమెకు మాత్రమే సాధ్యమౌతుంది. అసలు విషయంలోకి వెళితే... భారత్ సర్కార్ ఇటీవల యెమెన్ తీవ్ర‌వాదుల చెర నుంచి ఫాద‌ర్ టామ్‌ను రక్షించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నేపధ్యంలో "ఫాద‌ర్ టామ్‌ను ఐఎస్ఐఎస్ తీవ్ర‌వాదులు ఉరి తీసినా భార‌త ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎందుకంటే అత‌ను క్రైస్త‌వుడు కాబ‌ట్టి!` అని కాంగ్రెస్ నేత మ‌నీష్ తివారీ ట్వీట్ చేశారు. సుర‌క్షితంగా ర‌క్షించిన త‌ర్వాత మ‌నీష్ తివారీ ట్వీట్‌ను సుష్మా లైక్ చేశారు. ఆమె చేసిన లైక్ వ‌ల్ల ఇప్పుడు మ‌నీష్ తివారీ ట్వీట్ ట్విట్ట‌ర్‌లో ట్రెండింగ్‌గా మారింది. రీట్వీట్ చేయ‌డంపై మ‌నీష్ కూడా తెలివిగా స్పందించారు. `నా ట్వీట్‌ను లైక్ చేయ‌డం కంటే గొప్ప ప‌నులు మీరు చేయాల్సింది సుష్మాజీ అంటూ ఒమ‌న్ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ఓ ప్రెస్‌నోట్‌ను ట్యాగ్ చేశారు.