హైదరాబాద్, సెప్టెంబర్ 14 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఎస్ లోని అన్ని పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి 12 వ తరగతి వరకు తెలుగు భాషను ఒక సబ్జెక్ట్ గా తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయ౦ పట్ల సినీ హీరో మంచు మనోజ్ స్పందించారు. అయితే ఆయన చేసిన ట్విట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. "తెలంగాణలో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించే పాఠశాలలకు మాత్రమే అనుమతినిస్తానని స్పష్టం చేసిన కేసీఆర్ నిర్ణయం చాలా అభినందనీయం. ఆయన మన తెలంగాణ గాంధీ" అంటూ మనోజ్ ట్విట్ చేసారు. కాగా ఈ నిర్ణయం పట్ల ఇప్పటికే పలువురు ప్రముఖులు కేసీఆర్ కు అభినందనలు తెలియచేస్తున్నారు.