లక్నో, సెప్టెంబర్ 14 : ఉత్తరప్రదేశ్ లోని బాగ్పత్ జిల్లాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. యమునా నదిలో ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడి 15 మంది ప్రాణాలు కోల్పోగా, అనేకమంది గల్లంతయ్యారు. ఈ ప్రమాదం జరిగే సమయానికి పడవలో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో 12 మందిని రక్షించి వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, బిహార్ లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుని గంగా నదిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.