ప్రత్యేక రాష్ట్రం రావడమే మాకు శాపంగా మారింది

SMTV Desk 2017-09-14 12:11:08  Telangana, KCR, IKP Employees, TS Government

హైదరాబాద్, సెప్టెంబర్ 1: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ రాష్ట్ర ఐకేపి ఉద్యోగులు బేగంపేటలోని ముఖ్యమంత్రి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యక్రమంలోని ముఖ్యులు మాట్లాడుతూ... ప్రత్యేక రాష్ట్రం రావడమే శాపంగా మారిందని వాపోయారు. తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయని ఆశించామని, రాష్ట్రం ఏర్పడిన తరువాత అలాంటి ఆశలన్ని అడియాశలయ్యాయన్నారు. నిరసన కార్యక్రమానంతరం ఆందోళన చేపడుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐకేపీ సంఘ ఉపాధ్యక్షుడు శివప్రసాద్‌ తదితరులున్నారు.