కాంగ్రెస్ అసత్యలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు: కేటీఆర్

SMTV Desk 2017-09-14 11:02:13  IT Department Minister KTR, Farmers coordination sets, Congress

సిరిసిల్ల, సెప్టెంబర్ 14 : కాంగ్రెస్ నేతల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఐటీ శాఖమంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో రైతు సమన్వయ సమితిల అవగాహన సదస్సుకు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. సమన్వయ సమితిల వల్ల పంటలకు ధరను నిర్ణయించుకునే వీలు కలుగుతుందన్నారు. కృష్ణ, గోదావరి నీటితో 1.20 లక్షల ఎకరాలకు నీరు అందించాలన్న ముఖ్యమంత్రి లక్ష్యానికి అనుకున్నట్లు పనులు సాగుతున్నాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రైతు సమన్వయ సమితిలపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.