లక్నో, సెప్టెంబర్ 13 : భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి మరో 110 సంవత్సరాలు ఇలానే సేవలందించాలని ఆశిస్తూ ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రముఖ ఆర్టిస్టు జుల్ఫికర్ హుస్సేన్ 110 అడుగుల మోదీ కటౌట్ను రూపొందిస్తున్నారు. ఈ నెల 17న మోదీ 67వ జన్మదినాన్ని జరుపుకునే నేపథ్యంలో ఈ కటౌట్ను ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బీజేపీ కార్యాలయం ముందు పెట్టనున్నారు. అంతేకాకుండా ఆయన పుట్టిన రోజునాడు 1,500 కేజీల లడ్డూను, 105 కేజీల బెల్ను కూడా ప్రదర్శించనుండడం విశేషం. జుల్ఫికర్ హుస్సేన్ దుబాయిలో పెయింటింగ్ ఆర్టిస్టుగా పని చేసి, గతంలోనూ పలువురు నాయకుల భారీ కటౌట్లను తయారు చేసారు. ప్రస్తుతం ఆయన మోదీ కటౌట్ తయారు చేయాలనే ఉద్దేశంతోనే లక్నోకి రావడం జరిగింది.