న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: దేశంలోని బిజినెస్ మార్కెట్ల పరంగా విలువైన కంపెనీగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ స్థానంలో నిన్నటివరకు టిసిఎస్ ఉండగా, మంగళవారం మధ్యాహ్నం నాటికి ఈ బ్యాంక్ మార్కెట్ విలువ 4,73,530.72 కోట్లకు చేరడంతో టిసిఎస్ స్థానానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసింది. దీని ప్రకారం టిసిఎస్ మార్కెట్ విలువ 4,72,733.32 కోట్లుగా ఉంది. ఈ సంవత్సరం హెచ్డిఎఫ్సి బ్యాంకు షేర్ల విలువ సుమారు 53 శాతం పెరగగా, టిసిఎస్ షేర్ల విలువ కేవలం అయిదు శాతమే పెరిగింది. తాజాగా హెచ్డి ఎఫ్సి బ్యాంకు షేర్ల విలువ 0.73 శాతం పెరిగి 1,836.15కు చేరింది. దీంతో టిసిఎస్ మూడవ స్థానంలో ఉంది.