న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ను 1 శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటన వెలువరించింది. దీంతో బేసిక్ వేతనం పెన్షన్ క్రింద ప్రస్తుతం చెల్లిస్తున్న 4 శాతంగా ఉన్న డి.ఏ రేటును, 1 శాతం పెంచి దానిని 5 శాతం చేసింది. దీని వలన 50 లక్షల ఉద్యోగులకు, 61 లక్షల మంది పెన్షనర్లు లబ్దిని పొందనునట్లు సమాచారం. ఈ కొత్త రేటు జూలై 1 నుంచి అమలులోకి రానున్నట్లు కేంద్రం ప్రకటించింది.