ముంబాయి సెప్టెంబర్ 12: ‘ఆప్ కా అదాలత్’ షో లో కంగనా చేసిన వ్యాఖ్యలపై నేటికి చర్చ జరుగుతూనే ఉంది. ఓ సినిమా ప్రమోషన్ కోసమని వెళ్లిన కంగనా ఆ షో లో బాలీవుడ్ ప్రముఖులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హృతిక్ రోషన్, ఆదిత్య పంచోలి మరియు కరణ్ జోహార్ లపై విమర్శలు చేసింది. ఆ తరువాత ఆదిత్య పంచోలి కంగనా పై లీగల్ గా ఆక్షన్ తీసుకుంటానని అన్నారు, కరణ్ జోహార్ అయితే ట్విట్టర్ లో ‘వాళ్ళను వాళ్లు ఒకసారి ప్రశ్నించుకోవాలి’ అని ఒక పోస్ట్ చేసారు. ఆదిత్య పంచోలి భార్య కూడా కంగనా చేసిన ఆరోపణలను ఖండించింది. ఈ నేపథ్యం లో పత్రికలూ అనేక కథనాలు రాశాయి. ఆదిత్య పంచౌలి తో పాటు అయన కుమారుడు సూరజ్ పంచౌలిని కూడా ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో వార్తలు పోస్ట్ చేసారు. ఈ విధంగా తన ఖాతా ను ట్యాగ్ చేయడం తో సూరజ్ తన ట్విట్టర్ ఖాతా ను డిలీట్ చేసారు. చివరి సారిగా పోస్ట్ చేస్తూ ‘నన్ను, నా సోదరిని ఈ వివాదంలోకి లాగకండి’ అని ట్వీట్ చేసారు. ఈ వివాదం పై అసహనం తోనే తన ట్విట్టర్ ఖాతా ను డిలీట్ చేసాడు సూరజ్ పంచౌలి.