లక్నో, సెప్టెంబర్ 12 : పులుల అరుపులకు భయపడి కోతులకు గుండెపోటు వచ్చి మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. అసలు విషయంలోకి వెళితే.. ఇటీవల యూపీలోని కోత్వాలి మహమ్మది 12 కోతులు మృతి చెందినట్లు అక్కడి స్థానికులు అటవీశాఖకు సమాచారం అందించగా, అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ఆ కోతులకు పోస్టుమార్టం నిర్వహించడం జరిగింది. కేవలం గుండెపోటు వల్లే కోతులు మృతి చెందినట్లు వెల్లడైంది. పులులు అరవడం వల్లే కోతులు భయపడిపోయి వాటికి గుండెపోటు వచ్చి మృతి చెందుతున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. పులుల అరుపులకు కోతులకు గుండెపోటు రావడమేంటని వన్యప్రాణి నిపుణులు విమర్శిస్తున్నారు. విషా ఆహరం తీసుకోవడం వల్లే కోతులు మృతి చెందినట్లు వారు స్పష్టం చేశారు.