అంత్యక్రియలు చేసాక మళ్ళీ భర్తని చూసి అవాక్కయ్యిన భార్య..

SMTV Desk 2017-09-12 14:41:03  missing case,chennai,police

చెన్నై, సెప్టెంబర్ 12 : చనిపోయాడనుకున్న భర్త తిరిగి కొన్ని నెలల తరువాత కనిపించడంతో సంతోషం ఆపుకోలేక వెంటనే ఆయన గుండెలకు హత్తుకుపోయిన భార్య.. వివరాల్లోకి వెళ్తే... కేరళకు చెందిన రాజేశ్వరి (54), కృష్ణన్‌ కుట్టి (55) అనే దంపతుల మధ్య చిన్న చిన్న వివాదాలు రావడంతో గత ఏడాది నవంబర్ లో ఆమెను వదిలి వెళ్ళిపోయారు. దీంతో రాజేశ్వరి ఆయన గురించి వెతకని చోటులేకపోలేదు. లాభంలేక చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని నెలల తరువాత తమిళనాడులోని కొయంబత్తూరు పోలీసులు ఆమెకు ఫోన్ చేసి, కృష్ణన్‌ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో ఉన్నారని చెబుతూ, ఒక ఫోటోను ఆమెకు చూపించారు. దానిని ఆమె సరిగ్గా గుర్తుపట్టలేకపోయారు. దీంతో ఆ వ్యక్తి మృతి చెందాడంటూ సమాచారం అందించడంతో, ఆ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. కొన్ని రోజుల తరువాత ఆమె తమిళనాడులోని పళనిస్వామి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని, తిరుగు ప్రయాణం అవుతుండగా, గుడి మెట్ల వద్ద ఆమె భర్త కనిపించడంతో ఆనందం తట్టుకోలేక కేకలు వేస్తూ ఆయనను గుండెలకు హత్తుకున్నారు. గతంలో ఊర్లో అంత్యక్రియలు నిర్వహించిన వ్యక్తి వివరాలు రాజేశ్వరి, అక్కడి స్థానికులకు తెలిపారు.