చెన్నై, సెప్టెంబర్ 12 : 30 గంటల పాటు నోటితో ఈల వేస్తూ పాటలు పాడి గిన్నిస్ రికార్డు సృష్టించింది ఓ యువతి. గతంలో కెనడాకు చెందిన జెన్నిఫర్ అనావీ డేవిస్ అనే యువతి 25 గం. 30 ని. 5 సెకన్ల ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. ఈ రికార్డ్ కు సాటి రాలేరనుకుంటున్న తరుణంలో చెన్నైకి చెందిన పూజ చంద్రమోహన్ సెప్టెంబర్ 9 న ఉదయం 9 గం.లకు ప్రారంభమైన పూజ ఈల ప్రదర్శన సెప్టెంబర్ 10, మధ్యాహ్నం 3 గం.ల వరకు కొనసాగింది. ఈల వేయడంలో శిక్షణ పొందిన ఆమె హిందీ, ఇంగ్లిష్, కొరియన్, తమిళం భాషల్లో పాటలను ఈల వేస్తూ పాడి, కార్యక్రమానికి వచ్చిన వారిని ఆకట్టుకుంది. ఆమె దిల్వాలే దుల్హానియా లేజాయేంగే సినిమాలోని `డోలీ సజాకే రఖ్ నా` పాట ను ఈల ద్వారా పాడుతున్నపుడు అక్కడ ఉన్న వాళ్లు లేచి స్టెప్పులు వేశారు. ప్రదర్శన మొదట్లో చూపించిన ఉత్సాహాన్ని ఆమె చివరి వరకు కొనసాగించిందని కార్యక్రమానికి హాజరైన ప్రముఖ గాయని ఎస్పీ శైలజ పేర్కొన్నారు.