ఎప్పటికైనా ఆ స్థానం అమ్మదే : పళని స్వామి

SMTV Desk 2017-09-12 12:24:34  Tamil Nadu Chief Minister Palani Swami , Deputy panneer selvam, meeting in chinnai, media

చెన్నై, సెప్టెంబర్ 12 : శశికళ, దినకరన్ లకు పార్టీలో కొనసాగే అర్హత లేదని తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం చెన్నైలో పార్టీ సర్వసభ్య సమావేశం ముగిసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భౌతికంగా అమ్మ దూరమైనా, పార్టీకి సంబంధించినంత వరకూ అమ్మే శాశ్వత ప్రధాన కార్యదర్శి అని పేర్కొంటూ, అమ్మ గతంలో నియమించిన వారు తమతమ పదవుల్లో కొనసాగుతారని తెలిపారు. ప్రస్తుత డిప్యూటీ సిఎం పన్నీర్ సెల్వంను తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకూ పార్టీ ఆర్గనైజర్ గా నియమించామని, ఆయన నేతృత్వంలోనే పార్టీ కార్యకలాపాలు సాగుతాయని స్పష్టం చేశారు.