శశికళ బహిష్కరణకు ఇదే ప్రారంభమా?

SMTV Desk 2017-09-12 12:00:56  Shashikala, Dinakaran, Palani Swami, Paneer Selvam, meeting in chinnai

చెన్నై, సెప్టెంబర్ 12 : నేడు చెన్నై సమీపంలోని అన్నాడీఎంకే కీలక సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ప్రారంభం కాగానే, పార్టీ నుంచి శశికళతో పాటు ఆమె అల్లుడు దినకరన్ ను బహిష్కరించే తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, ప్రస్తుతం అది ఓ చర్చనీయాంశంగా కొనసాగుతోంది. పళని స్వామి, పన్నీర్ సెల్వం రెండు వర్గాలు కలిసిన తరువాత తొలిసారి ఈ సర్వసభ్య సమావేశం జరుగగా, దినకరన్ కు చెందిన 20 మంది ఎమ్మేల్యేలు హాజరుకాలేదు. ఆ తర్వాత శశికళను, దినకరన్ ను పార్టీ సభ్యత్వం నుంచి బర్తరఫ్ చేస్తూ, నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఏం చేయాలన్న విషయమై దినకరన్ వర్గం సైతం చర్చలు సాగుతున్నాయి. తామంతా మూకుమ్మడి రాజీనామాలు చేసి ప్రభుత్వాన్ని పడదోస్తామని కొందరు దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నా, ఎంతమంది ఈ నిర్ణయాన్ని సమర్థిస్తారన్న విషయంపై మాత్రం అనుమానాలున్నాయి.