మరోసారి సేల్ఫీతో పొంచి వచ్చిన ప్రమాదం

SMTV Desk 2017-09-11 19:29:57  Selfie hazards, Sammerpet zone in Medchal, Hanumandlakunta, engineering student Died

హైదరాబాద్, సెప్టెంబర్ 11 : రోజు రోజుకి సెల్ఫీ ప్రమాదాలు పెరిపోతున్నాయి. తాజాగా సేల్ఫీ కోసం ప్ర‌య‌త్నించి మేడ్చ‌ల్‌లోని శామీర్‌పేట మండలం మజీద్‌పురాలోని హనుమండ్లకుంటలో ప‌డి ఓ ఇంజ‌నీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో ఆ విద్యార్థి మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీశారు. ఇంజనీరింగ్ క‌ళాశాల‌కు చెందిన ఓ విద్యార్ధి కొంతమంది స్నేహితులతో కలిసి హనుమండ్లకుంట వచ్చార‌ని, అక్క‌డ సెల్ఫీలు తీసుకుంటుండ‌గా ప్రమాదంతో ఓ విద్యార్థి ఇలా ప్రాణాలు కోల్పోయాడ‌ని పోలీసులు వెల్లడించారు.