శ్రీనగర్, సెప్టెంబర్ 11, : నేడు జమ్ముకశ్మీర్ లో భద్రత బలగాల చేతుల్లో మరో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. కుల్గామ్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. కుల్గామ్ లోని కుడ్వానిలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వ్యవస్థ ద్వార సమాచారం అందుకున్న భద్రత బలగాలు ఆ ప్రాంతానికి చేరి తనిఖీలు చేపట్టారు. వారి రాకను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరుపగా, వెంటనే అప్రమతమైన సిబ్బంది ఎదురు కాల్పులకు దిగగా ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. మృతులిద్దరు హిజ్బుల్కు చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్న భద్రత బలగాలు ఘటన ప్రాంతంలో మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. అక్కడ ఏకే 47 సహా కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో మరి కొందరు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో సోదాలు కొనగిస్తున్నాయి.