గుజరాత్, సెప్టెంబర్ 11 : కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వస్తు సేవ పన్ను జీఎస్టీ కేవలం దేశ వస్తువు పన్నుకే పరిమితం కాకుండా పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టుకోవడానికి కూడా బాగానే కలిసి వచ్చింది. ఈ పన్ను విధానం అమలుకు వచ్చిన నాడే రాజస్థాన్ కు చెందిన ఓ మహిళ ప్రసవించి ఆడపిల్లకు జన్మనిచ్చి జీఎస్టీ అని నామకరణ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే బాటలో మరో యువతి కూడా ఏకంగా ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చి జీఎస్టీలోని తొలి మూడు పదాలతో కలిసివచ్చే అక్షరాలతో పేర్లు పెట్టిందట, సూరత్ కు చెందిన కాంచన్ పటేల్ అనే మహిళ శనివారం నాడు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. వారికి గరవి, సాంచి, తరవి అనే పేర్లు పెట్టింది. ఇలా పెట్టడానికి గల కారణం తమకు జీఎస్టీ ఒకే పన్ను తీరు నచ్చడంతో ఇలా పేర్లు పెట్టామని ఆ పిల్లల తల్లి తెలిపారు.