పంజాగుట్ట మోడల్ పోలీసు స్టేషన్ ను సందర్శించిన సుశీల్‌కుమార్‌ మోదీ

SMTV Desk 2017-09-10 16:34:28  Bihar Deputy Chief Minister, Sushil Kumar Modi, Police Station, Panjagutta

హైదరాబాద్, సెప్టెంబర్ 10: హైదరాబాద్ మహానగరంలో మోడల్ పోలీసు స్టేషన్ గా పేరు గాంచిన పంజాగుట్ట స్టేషన్‌ను బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ సందర్శించారు. పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌, సీపీ మహీందర్‌రెడ్డి తదితరులు ఆయనకి కావల్సిన సమాచారాన్ని తెలియ చేసారు. ఈ సందర్భంగా స్టేషన్ నిర్వహణ తీరు బాగుందని ఆయన కొనియాడారు. హైదరాబాద్ పర్యాటనలో ఉన్న సుశీల్ మోదీ ఇక్కడికి విచ్చేశారు.