వైద్యుల నిర్లక్ష్యానికి బల్లపై నుండి కిందపడి పసికందు బలి...

SMTV Desk 2017-09-10 13:40:39  khammam, government hospital,

ఖమ్మం, సెప్టెంబర్ 10: ఖమ్మం జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఓ దారుణం చోటు చేసుకుంది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం....పల్లెగుడెం కు చెందిన ఓ నిండు గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతూ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. అక్కడి వైద్యులు ప్రాధమిక పరిక్షలనంతారం ఆమెను బల్లపై విశ్రాంతి తీసుకోమన్నారు. ఆ సమయంలో తీవ్రంగా నొప్పులు రావడంతో వైద్య సిబ్బందికి చెప్పిన పట్టించుకోని వైనం ఆమె బల్లపైనే ప్రసవించడంతో ఆ మగ శిశువు జారి కింద పడి మృతి చెందింది. శిశువు మరణంతో తల్లితండ్రులు కన్నితిపర్యంతమయ్యారు. దీంతో బాధితుల బంధువులు వైద్యుల నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ ఘటన పై స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు దీనికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని, మళ్ళి పునరావృత్తం కాకూడదని ఆదేశించారు.