న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10 : శ్రీలంకతో మైత్రికి భారత్ అధిక ప్రాధాన్యం ఇస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఆ దేశ అగ్రనాయకత్వంతో కలిసి పని చేయడాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నట్లు ఢిల్లీ పర్యటనకు వచ్చిన శ్రీలంక విదేశాంగ మంత్రి తిలక్ మరపానాను కలిసిన సందర్భంగా తెలిపారు. శ్రీలంక విదేశాంగ మంత్రిగా కొత్త బాధ్యతలు చేపట్టడంపై తిలక్ ను ప్రధాని మోదీ అభినందించారు. మే నెలలో అంతర్జాతీయ వేసవి దినోత్సవం సందర్భంగా తాను చేపట్టిన శ్రీలంక పర్యటన ఎంతో ఫలప్రదంగా సాగిందని మోదీ గుర్తు చేశారు.