వరంగల్ జిల్లాలో స్వైన్ ఫ్లూ తో ఏసీపీ దుర్గయ్య యాదవ్ మృతి

SMTV Desk 2017-09-10 13:07:22  warangal, wardhannapet, hyderabad, police officer,

వరంగల్, సెప్టెంబర్ 10: వరంగల్ జిల్లాలో స్వైన్ ఫ్లూ అంతటా వ్యాపిస్తుంది. జంట నగరాలల్లో ప్రభుత్వ, ప్రైవేటు, ఆసుపత్రులు జ్వర పిడితులతో కిక్కిరిస్తున్నాయి. రోజు రోజుకి స్వైన్ ఫ్లూ, విషజ్వరాలు భారిన పడిన రోగుల సంఖ్య పెరుగుతు౦ది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట కు చెందిన ఏసీపీ దుర్గయ్య యాదవ్ కు స్వైన్ ఫ్లూ వ్యాధి రావడంతో సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ లో చేరారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో అయన మృతి చెందారు. వరంగల్ లోనే మరో సీఐకు కూడా తీవ్ర విష జ్వరంతో బాధపడుతుండడంతో తీవ్ర భయాందోళన నెలకొంది.