న్యూఢిల్లీ, సెప్టెంబర్ 09 : శుక్రవారం ఢిల్లీ గురుగ్రామ్లోని రేయాన్ అంతర్జాతీయ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ప్రధుమన్ (7) అనే బాలుడిని బస్సు కండక్టర్లలో ఒకడైన అశోక్కుమార్ దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో పాఠశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాఠశాలకు ఈ ఉదయం పెద్ద ఎత్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు చేరుకొని ఆందోళనకు దిగారు. స్కూలు యాజమాన్యంపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో తమ పిల్లలకు రక్షణ లేదంటూ ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. అయితే ఈ బాలుడి మృతికి ఇంకా కారణాలు తెలియరాలేదు.