హైదరాబాద్, సెప్టెంబర్ 09 : గత ఏడాది ఎల్బీ స్టేడియంలో అత్యధికమంది మహిళలు ఒకేసారి బతుకమ్మ ఆడి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని చాటి చెప్పే బతుకమ్మ వేడుకను ఈ సంవత్సరం కూడా మరింత ఘనంగా జరుపుకుంటామని నిజామాబాద్ ఎంపీ కవిత తెలిపారు. ఈ ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఈ నెల 18, 19 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తామని చెప్పారు. గత సంవత్సరంలాగే ఈ నెల 26న ఎల్బీ స్టేడియంలో 40 వేల మంది మహిళలతో మెగా బతుకమ్మ ఉంటుందన్నారు.