జమ్మూ కాశ్మీర్, సెప్టెంబర్ 09 : జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. బారాముల్లా జిల్లా సోపోర్ సమీపంలోని రేబన్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. వారి రాకను గమనించిన ఉగ్రవాదులు వారిపైకి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులతో వారికి సమాధానం ఇచ్చారు. కాల్పులు జరుగుతున్న ప్రాంతం నుంచి ఉగ్రవాదులు తప్పించుకోకుండా అధికారులు అదనపు బలగాలను రప్పించుకున్నట్లు సమాచారం.