మోడీపై మండి పడ్డ కేరళ ముఖ్యమంత్రి..!

SMTV Desk 2017-09-09 13:40:27  Kerala Tourism Minister, Kadakampally Surendran, China Global Tourism Event, Ministry of External Affairs, kerala chief minister, modi, surendran, latest update kerala

త్రివేండ్రం, సెప్టెంబర్ 09 : కేరళ టూరిజం మంత్రి విషయంలో విదేశాంగ శాఖ వ్యవహరించిన తీరుపై కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శలు గుప్పించారు. అసలు విషయంలోకి వెళితే.. చైనాలో ఈ నెల 11 నుంచి 16 తేదీల మధ్య గ్లోబల్ టూరిజం సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో కేరళ టూరిజం శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ కు సదస్సుకు రావాలంటూ ఆహ్వానం అందింది. అయితే విదేశాంగ శాఖ మాత్రం మంత్రి సురేంద్రన్‌కు అనుమతి నిరాకరించడంతో, దీనిపై స్పందించిన సురేంద్రన్‌ కేంద్రానికి లేఖ రాయగా, దానికి బదులు కూడా ఇవ్వలేదంట.‘ఇది పూర్తిగా రాజకీయ నిర్ణయమన్న విషయం స్పష్టమౌతోంది. కనీసం కారణాలు కూడా వివరించలేదని సురేంద్రన్‌ తెలిపారు. ఈ మేరకు విషయాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్తానని ఆయన వెల్లడించారు.