వాషింగ్టన్, సెప్టెంబర్ 08 : భారత్ సహా చైనా రష్యా వంటి అగ్ర దేశాలు సభ్యులుగా ఉన్న బ్రిక్స్ కూటమి పాక్ భూభాగాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్ర ముఠాలపై చర్యలకు డిమాండ్ చేసిన రోజుల వ్యవధిలోనే అగ్రరాజ్యం అమెరికా కూడా ఆ దేశానికి పలు సూచనలు చేసింది. తమ భాభాగాన్ని కేంద్రంగా చేసుకుని పని చేస్తున్న ఉగ్ర ముఠాల విషయంలో పాక్ తన వైఖరిని మార్చుకోవాలని సూచించిన అమెరికా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరోసారి స్పష్టంగా తెలిపింది. భద్రతకు ముప్పుగా మారిన ఉగ్ర సంస్థలపై పాక్ కఠిన చర్యలు తీసుకోగలదని తాము ఎదురు చూస్తున్నట్లు ప్రకటించింది.