చండీగఢ్, సెప్టెంబర్ 08 : రోజు రోజుకి గుర్మీత్ రామ్ రహీమ్ లీలాలు వెలుగులోకి వస్తున్నాయి... ఈ ఉదయం నుంచి సిర్సాలోని డేరాలో సోదాలు జరుపుతున్న పారా మిలటరీ బలగాలు, పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు వెలుగులోకి రాని నిజాలను వేలీకి తీశారు. ఈ ప్రాంతంలో కర్ఫ్యూ విధించి మరీ డేరాలో సోదాలు జరుపుతున్న పోలీసులకు రెండు గదుల నిండా కొత్త కరెన్సీ లభించినట్టు విశ్వసనీయ సమాచారం. వీటితో పాటు మరో గది నిండా మారణాయుధాలు బయటపడ్డాయని, గుర్మీత్ తో దందాలు నడిపించిన వారి వివరాలతో కూడిన హార్డ్ డిస్క్ లను సైతం స్వాధీనం చేసుకున్న పోలీసులు, దాన్ని ఫోరెన్సిక్ టీమ్ కు పంపించారని తెలుస్తోంది. అయితే, సౌదా చేయాల్సిన గదులు ఇంకా ఉండగా, వాటిని మాత్రం ఉన్నతాధికారులు, ఫోరెన్సిక్ టీమ్ సమక్షంలోనే తెరవాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.