రోహింగ్యా ముస్లింలు తరిమేయమంటున్న సాధ్వి ప్రాచి సంచలన వ్యాఖ్యలు

SMTV Desk 2017-09-08 11:35:37  Rohingya Muslims, Myanmar, Rakhine State, Army

న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 08 : భారత్ లో అక్రమంగా చొరబడిన రోహింగ్యా ముస్లింలు గత కొన్నేళ్లుగా మయన్మార్ లోని రఖైన్ రాష్ట్రంలోని రోహింగ్యా తిరుగుబాటుదారులకు, ఆర్మీకి మధ్య అంతర్యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఊళ్లకు ఊళ్లు నాశనం అయిపోయాయి. ఈ నేపథ్యంలో భారత్ లోని ఢిల్లీకి ప్రవేశించిన కొందరు రోహింగ్యా ముస్లింల పై వీహెచ్ పీ నాయకురాలు సాధ్వి ప్రాచి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మయన్మార్ నుంచి అక్రమంగా భారత్ లో ప్రవేశించిన రోహింగ్యా ముస్లింలు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల కంటే ప్రమాదకరమైనవారని ఆమె పేర్కొన్నారు. వీరందరినీ తిరిగి మయన్మార్ కు పంపించేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే 40 వేల మంది రోహింగ్యాలు మన దేశంలో ప్రవేశించారని... వారిలో దాదాపు 15 వేల మంది జమ్ముకశ్మీర్ లో ఉన్నారని అన్నారు. వీరి అక్రమ చొరబాట్ల వల్ల భారత్ లో ఉగ్రవాదం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రోహింగ్యా ముస్లింలకు ఆశ్రయం ఇవ్వడానికి ముస్లిం దేశాలు కూడా ముందుకు రావడం లేదని... అలాంటప్పుడు మనమెందుకు ఆశ్రయం ఇవ్వాలని ప్రశ్నించారు. వీరికి ఆశ్రయం ఇవ్వడానికి మన దేశమేమీ ధర్మశాల కాదని ఆమె అసహనం వ్యక్తం చేశారు.