హైదరాబాద్ సెప్టెంబర్ 8: గ్రేటర్ హైదరాబాద్ వాసులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెట్రో రైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా నవంబర్ 28వ తేదిన దీనిని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానిని ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లేఖ రాశారు. ఈ ఏడాది నవంబర్ 28 నుంచి 30 వరకు హైదరాబాద్లో గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్స్ సదస్సు జరగనుంది. ప్రధాని అందులో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. దీంతో ఇదే సందర్భంలో ప్రధాని చేతుల మీదుగా మెట్రో రైలును ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మెట్రో కారిడార్లలో తొలివిడతగా నాగోల్-అమీర్ పేట(17కి.మీ), ఎస్ఆర్ నగర్-మియాపూర్(13కి.మీ) మార్గాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ రెండు కారిడార్లలో పనులన్నీ పూర్తయ్యాయి అని. భద్రతాపరమైన అనుమతులు కూడా వచ్చాయి అని తెలిపారు.