న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 07 : ప్రస్తుతం ఏ దేశంలో చూసిన బ్లూవేల్ గేమ్ కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. భారత్లో కూడా ఈ బ్లూవేల్ గేమ్ విజృంభిస్తోంది. ఈ ఆన్లైన్ గేమ్ బారినపడి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ప్రతిరోజూ వెలుగులోకి రావడం జరుగుతుంది. దీని బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలే రాజస్థాన్లోని జోధ్పూర్లో ఓ బీఎస్ఎఫ్ జవాను కుమార్తె (17) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆమెను పోలీసులు స్థానికుల సాయంతో కాపాడారు. అయితే, ఆమె మరోసారి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంట్లో ఆమె నిద్రమాత్రలు మింగడంతో, ఈ విషయాన్ని గుర్తించిన ఆమె తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. అంతేకాకుండా ఆమె చేతిపై బ్లూవేల్ బొమ్మ ఉంది. ఇటీవలే ఆమె మీడియాతో మాట్లాడుతూ బ్లూ వేల్ గేమ్లో చివరి టాస్క్ పూర్తి చేయకపోతే తన తల్లి ప్రాణాలకు ముప్పు ఉందని వ్యాఖ్యలు చేసింది.