పాపం పండింది..శిక్ష పడింది..!

SMTV Desk 2017-09-07 14:43:13  mumbai, mumbai blast at 1993,

ముంబై, సెప్టెంబర్ 7: ముంబై పేలుళ్ళ కేసులో దోషులకు శిక్ష ఖరారు చేశారు. 1993 లో మార్చి 12 న ముంబై వరుసగా 12 చోట్ల పేలుళ్లతో 257 మంది మృతి చెందగా, 713 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి కి పాల్పడ్డ వారిని ఆరుగురు దోషులను కోర్టు గుర్తించింది. ఇందులో ప్రధాన నిందితుడు ముస్తఫా దోసా ఇటివలే మరణించాడు. ఈ రోజు మిగిలిన ఐదుగురు దోషులకు టాడా కోర్టు శిక్ష అమలు చేసింది. ఐదుగురు లో తాహిర్ మర్చంట్, ఫిరోజ్ కు మరణశిక్ష అమలు చేయగా అబుసలేం, కరీ ముల్లాకు జీవితఖైది తో పాటు 2 లక్షల జరిమానా విధించారు. రియాజ్ సిద్దిఖి 10 ఏళ్ల జైలు శిక్ష విధించారు.