చెన్నై, సెప్టెంబర్ 07 : ఇటీవల ఉత్తర చెన్నైలో మాదక ద్రవ్యాలను నిషేదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ముఖ్య నేత, టీవీ దినకరన్ వర్గంలో కీలకుడైన ధనశేఖరన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మత్తు పదార్థాలు విక్రయించిన కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. చెన్నైలో నిషేధించబడిన మాదక ద్రవ్యాలను విక్రయిస్తూ, కొందరు పట్టుబడగా, విచారణ అనంతరం వారి వెనకుంది ధనశేఖరనేనని తేలడంతో, పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు తండయారుపేట, వాషర్ మెన్ పేట, కొరుక్కుపేట, రాయపురం, కాశిమేడు ప్రాంతాల్లో సోదాలు చేసిన పోలీసులు, 300 కిలోల జర్దా, 50 కిలోల మావాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేలో కొంతకాలం పనిచేసిన ధనశేఖరన్, ఆపై అన్నాడీఎంకే లోకి వచ్చి శశికళ అనుచరుడిగా ఆయన ఉన్నారు.