పాతబస్తీలో దారుణం...వ్యక్తి పై కత్తులతో దాడి..!

SMTV Desk 2017-09-07 10:29:13  hyderabad, pathabasthi, crime

హైదరాబాద్, సెప్టెంబర్ 7: హైదరాబాద్ పాతబస్తీ లో దారుణం చోటు చేసుకుంది. పాతబస్తీ లోని డబీర్ పురా గ్రాండ్ స్నూకర్ సెంటర్ లో దుండగులు బీభత్సం సృష్టించారు. క్యాషియర్ షబ్బీర్ హుస్సేన్ పై కర్రలు, కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ షబ్బీర్ ను ఉస్మానియా ఆసుపత్రికి తరాలించారు. పోలిసుల కథనాల ప్రకారం....దాడికి పాల్పడ్డ వారు అమీర్, మెస్సి, హైదర్ గా గుర్తించారు. నిందితుల కోసం టాస్క్ ఫోర్స్ సహా రెండు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పాతబస్తీ లో స్నూకర్స్, హుక్కా సెంటర్ల కు అనుమతిలేదు, చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కేంద్రాలపై చర్యలు తీసుకుంటామని సౌత్ జోన్ డీసీపి సత్యనారాయణ వెల్లడించారు.