బెంగళూరు, సెప్టెంబర్ 06 : ప్రముఖ రచయిత్రి, సీనియర్ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ పై నిన్న రాత్రి ఆమె ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి విచక్షణారహితంగా ఆమెపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రంలో ఆమె భౌతిక దేహానికి ప్రజలు కన్నీటి వీడ్కోలు తెలిపారు. అలాగే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పలువురు నేతలు, సినీ ప్రముఖులు తదితరులు ఆమెకు నివాళులర్పించారు. బెంగళూరులోని చమరాజ్పేటలో అధికార లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో ప్రముఖ సినీనటుడు ప్రకాశ్రాజ్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. లంకేశ్ మృతిపై దర్యాప్తునకు ఇప్పటికే సిట్ను ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ఆమె కుటుంబ సభ్యులు సీబీఐ దర్యాప్తు కోరితే దానిపైనా ఆలోచిస్తామని స్పష్టంచేశారు.