27 న ఆంధ్రాకు కేసీఆర్.. పర్యటన వెనక అసలు కారణం ఇదే...!

SMTV Desk 2017-09-06 14:33:08  kcr, kcr andhra tour, kcr telangana, telangana news

హైదరాబాద్ సెప్టెంబర్ 6: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 27 న ఆంధ్రప్రదేశ్ కు వెళ్లనున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దుర్గమ్మకు బంగారు ముక్కు పుడక చేయిస్తానని మొక్కుకున్నారట. ఆ మొక్కు తీర్చుకోవడానికే కేసీఆర్ ఆంధ్రా పర్యటనకు వెలుతున్నారని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. సతీసమేతంగా మొక్కులు చెల్లించుకుంటానని మొక్కిన నేపథ్యంలో ఆయన కుటుంబం తో కలిసి దుర్గమ్మ దర్శనానికి వెళ్లనున్నారు. అయితే ఈ మొక్కుతో కేసీఆర్ మొక్కులన్నీ తీరినట్టే అని ముఖ్యమంత్రి కార్యాలయ విభాగం వెల్లడించింది. అంతేకాక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తో కూడా భేటీ అయ్యే అవకాశాలు లేకపోలేదు. రెండు రాష్ట్రాల మధ్య నీటి ఒప్పందం కుదుర్చుకునే అవకాశం కూడా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మిగిలిన కొన్ని సమస్యలను కూడా బాబుతో కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తుంది. కాగా, ఇప్పటికే తిరుమల వెంకన్నకు, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి, వరంగల్ భద్రకాళి అమ్మవారికి, కురవి వీరభద్ర స్వామికి మొక్కిన మొక్కులను కేసీఆర్ తీర్చుకున్నారు.