విజయవాడ అమ్మాయిలు, హైదరాబాద్ నిమజ్జనానికై...

SMTV Desk 2017-09-06 14:27:00  vijayawada, nunna, teachers day, hyderabad

విజయవాడ, సెప్టెంబర్ 6: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్కూలుకని బయలుదేరి వెళ్లిన ముగ్గురు అమ్మాయిలను పోలీసులు క్షేమంగా విజయవాడలోని వాళ్ల ఇళ్ళల్లోకి చేర్చారు. అసలు వాళ్లు హైదరాబాద్ కి రావడానికి గల కారణం ఏంటంటే ...పోలిసుల కథనాల ప్రకారం...చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లో వైభవంగా జరిగే వినాయక నిమజ్జన వేడుకల గురించి వింటూ వచ్చిన వారు, ఈ సంవత్సరం ప్రత్యక్షంగా నిమజ్జనాన్ని చూడాలని ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ వచ్చేశారని పోలీసులు వెల్లడించారు. ఖైరతాబాద్ గణేశ్ ను చూడాలన్న ఆశతో వీరు వచ్చారని తెలిపారు. వీరు వచ్చేటప్పటికే, ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ముగిసిందని, కాసేపు ఉండి తిరిగి బయలుదేరాలని వీరు భావించారు, అంతలోనే వారి ఆచూకీని కనిపెట్టామని తెలిపారు. మరోమారు ఇలాంటి పనులు చేయవద్దని బాలికలకు కౌన్సెలింగ్ ఇచ్చినట్టు పేర్కొన్నారు.