ఆధార్ నమోదు కేంద్రాల పై ఆధార్ సీఈవో హెచ్చరిక

SMTV Desk 2017-09-06 12:03:29  Aadhaar Registration Centers, Fine for banks, UIDAI CEO Ajay Bhushan Pandey

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 06 : దేశంలో ఆధార్ నమోదు కేంద్రాలు లేని బ్యాంకులకు జరిమానా విధించనున్నట్టు యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే హెచ్చరించారు. ఈ నెల 30 లోపు బ్యాంకులు కనీసం పదిశాతం బ్రాంచుల్లో అయినా ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో విఫలమైన బ్యాంకులకు అక్టోబరు నుంచి ప్రతినెల రూ.20వేల చొప్పున జరిమానా విధించనున్నట్లు ఆయన తెలిపారు. ఆధార్ నమోదు కేంద్రాల ఏర్పాటుకు అదనపు సమయం కావాలని అడగడం వల్లే మరో నెల రోజుల గడవు ఇచ్చామన్నారు. ఆ తర్వాత కూడా కేంద్రాలను తెరవకుంటే జరిమానా చెల్లించక తప్పదన్నారు. వంద బ్రాంచులున్న బ్యాంక్ ఈ నెల ఆఖరులోగా కనీసం పది బ్రాంచుల్లోనైనా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. కాగా, బ్యాంకులో ఖాతా ప్రారంభించడానికి, రూ.50 వేలకుపైన నగదు లావాదేవీలు నిర్వహించడానికి ఆధార్ నంబరును ప్రభుత్వం తప్పనిసరి అన్న విషయం తెలిసిందే.