విజయవాడలో మాయమైన అమ్మాయిలు...హైదరాబాద్ లో ప్రత్యక్షం..!!

SMTV Desk 2017-09-06 11:43:41  vijayawada, nunna, teachers day, hyderabad

విజయవాడ, సెప్టెంబర్ 6: తాజాగా విజయవాడలో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. విజయవాడలోని శివారు ప్రాంతమైన నున్నలో ఈ ముగ్గురూ పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో 9వ తరగతి చదువుతూ, స్కూలుకు వెళ్లి, తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, పోలీసులను ఆశ్రయించగా, ముగ్గురు అమ్మాయిల్లో ఒకరి వద్ద ఉన్న సెల్ ఫోన్, వారిని పట్టిచ్చింది. ఈ ఘటన నిన్న ఉపాధ్యాయ దినోత్సవం నాడు చోటు చేసుకుంది. వెంటనే అమ్మాయిల ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. వీరు ముగ్గురినీ హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని విజయవాడకు తీసుకెళ్తున్నారు. పోలిసుల కథనాల ప్రకారం..వీరు ఎందుకు హైదరాబాద్ వెళ్లారన్న విషయాన్ని ప్రశ్నించి తెలుసుకుంటామని, ప్రస్తుతం వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చే పనిలో ఉన్నామని పేర్కొన్నారు.