ముంబాయి సెప్టెంబర్ 6 : ‘ట్యూబ్ లైట్’ చిత్రoతో ఓటమిని చూసిన సల్మాన్ భాయి ఈ సారి ఎలా అయిన హిట్ కొట్టాలన్న ధీమా తో ఉన్నాడు సల్మాన్ ఖాన్. 2012 లో విడుదలై మంచి విజయం సాధించిన ఈయన చిత్రం ‘ఏక థా టైగర్’ కు కొనసాగింపుగా వస్తున్న ‘టైగర్ జిందా హై’ చిత్రంలో ఒక కీలక పాత్రలో కిచ్చ సుదీప్ నటిస్తున్నట్లు సమాచారం. పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ జహీర్ పాత్రలో సుదీప్ కనిపించనున్నారట. ఈ సినిమాలో నటించడానికి పెద్ద మొత్తంలో పారితోషకం తీసుకున్నారని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సుదీప్ విలన్ పాత్రలో నటిస్తారని అంటున్నారు, అయితే ఈ విషయాన్నీ చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ జహీర్ పాత్రలో సుదీప్ కనిపించనున్నారట. ఈ చిత్రంలో కత్రిన కైఫ్ హీరోయిన్ గ నటిస్తుంది. ఈ చిత్రానికి విశాల్-శేఖర్ స్వరాలుసమకూరుస్తున్నారు, డిసెంబరు 22న ఈ చిత్రం విడుదల కానుంది.