న్యూఢిల్లీ, సెప్టెంబర్ 05 : మళ్లీ చోటుచేసుకున్న ఎన్నారై కిరాతకం.. అసలు విషయంలోకి వెళ్లితే.. భారత్కు చెందిన సిల్కీ గెయింద్ (33) తన భర్త దేవబిర్ తో కలిసి అమెరికాలో ఉంటోంది. వారి అన్యోన్య దాంపత్యానికి చిహ్నంగా ఓ ఏడాది పాప కూడా ఉంది. కాగా, కొన్ని రోజులుగా వారిద్దరు గొడవలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తన భార్యను ఎలాగైనా హింసించాలనుకున్న సదరు భర్త భారత్లో ఉంటోన్న తన తల్లిదండ్రులను అమెరికాకు పిలిపించుకున్నాడు. వారికి భార్యను హింసించాలంటూ చెప్పడంతో, ఉద్దేశపూర్వకంగా భార్యతో గొడవ పెట్టుకోవడంతో పాటు ఆమెపై చెయ్యి చేసుకోబోయాడు. దీంతో ఆమె ఎదురు తిరగడంతో అతడి తల్లిదండ్రులు భర్త ముగ్గురూ కలిసి సిల్కీకిని చావబాదారు. పాప ఆమె దగ్గరే ఉండడంతో పాపకు కూడా గాయాలు తగిలాయి. ఎలాగైనా ఇండియాలోని తన తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని చేరవేయాలన్న ఆమె ప్రయత్నం ఫలించడంతో ఇక్కడి పరిస్థితు గురించి తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో ఆమె తల్లి ఫ్లోరిడా పోలీసులకు సమాచారం అందించడంతో వారు హౌస్టన్ లో ఆమె ఉంటున్న నివాసానికి వచ్చారు. అయితే, ఆమె ఉంటోన్న ఇంటి తలుపులను అత్తమామలు ఎంతకీ తెరవలేదు. దీంతో పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి నిందితులని అరెస్టు చేశారు. ప్రస్తుతం సిల్కీతో పాటు ఆమె కూతురికి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నట్లు సమాచారం.