న్యూఢిల్లీ, సెప్టెంబర్ 05 : ఇటీవల అక్రమ ఆస్తుల కేసు విషయంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి గాలి జనార్ధనరెడ్డి పై విచారణ జరుగుతుండడంతో, ఇంతలో తన సొంత ఊరైన బళ్లారికి వెళ్ళాల్సి వచ్చింది. దీంతో సుప్రీంకోర్టును అనుమతికై ఆశ్రయించడం జరిగింది. కానీ ఆయన వినతిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆయనను బళ్లారికి వెళ్లనిస్తే సాక్ష్యాలను నాశనం చేయడం, లేదా తారుమారు చేసే అవకాశం ఉందని సీబీఐ న్యాయవాదులు చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించడంతో, జైలు నుంచి బెయిల్ పై విడుదలైన గాలి జనార్దనరెడ్డి తన కుమార్తె వివాహం సందర్భంగా సొంత ఊరుకు వెళ్లిన విషయం తెలిసిందే.