15.60 లక్షలు పలికిన బాలాపూర్ గణేష్ లడ్డూ...!

SMTV Desk 2017-09-05 11:33:17  balapur ganesh, ganesh, balapur laddu bid, hyderabad ganesh

హైదరాబాద్ సెప్టెంబర్ 5: హైదరాబాద్ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట ముగిసింది. అందరూ ఊహించినట్టుగానే ఈ సారి కూడా లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది. ఈ సారి లడ్డూ ను జూబ్లీహిల్స్‌లోని అయ్యప్ప సొసైటీకి చెందిన నాగం తిరుపతిరెడ్డి రూ.15.50లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. బాలాపూర్ గణేష్ లడ్డూను దక్కించుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని ఈ సారి అవకాశం దక్కిందని, లడ్డూ ను దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, దీనికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని తిరుపతి రెడ్డి అన్నారు. ఈ సారి వేలంపాట లో మొత్తం 21 మంది పాల్గొన్నారు. గతంలో కంటే ఈ సారి 95 వేలు ధర ఎక్కువగా పలకడం గమనార్హం.