రైల్వే కార్యాలయంలో రాస క్రీడలు సీసీ పుటేజీనే ప్రత్యక్ష సాక్షి...!!

SMTV Desk 2017-09-05 11:05:16  railway dipaartment, govt employess, general news, indian news, railway news

ముంబై సెప్టెంబర్ 4: ప్రభుత్వ కార్యాలయ్యాల్లో ప్రభుత్వ ఉద్యోగులు సాగిస్తున్న రాసలీలలు సీసీ టీవీ పుణ్యమాని బట్టబయలు అవుతున్నాయి. ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులుగా చలామణి అవుతూ ఇలాంటి నీచమైన కార్యానికి పాల్పడుతున్న చాలా మంది బాగోతాలు ఇప్పటివరకు బయటపడ్డాయి. అయితే ముంబై లో ఒక రైల్వే ఉద్యోగి సాగిస్తున్న రాసలీలలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. అతని కామ క్రీడ బయట పడడంతో రైల్వే అధికారులు అతనిపై విచారణకు ఆదేశించారు. ముంబై నగరంలోని లోకమాన్య తిలక్ టెర్మినల్ లోని పార్శిల్ కార్యాలయంలో హెడ్ క్లార్క్ గా పనిచేస్తున్న అజయ్ బోస్ బార్ లో పనిచేస్తున్న ఒక ఆర్కెస్ట్రా యువతితో సన్నిహితంగా మెలగడం సీసీ పుటేజ్ లో రికార్డ్ అయింది. దాదాపు 90నిమిషాల పాటు రికార్డ్ అయిన ఈ వీడియో లో యువతి పై చేతులు వేయడం, కలిసి భోజనం చేయడం, యువతీ పడుకోవడం, బట్టలు మార్చుకోవడం, ఆ యువతిని తీసుకొచ్చిన టాక్సీ డ్రైవర్ కూడా బెంచీ పై పడుకోవడం ఆ వ్యక్తిని కూడా మనం ఫోటోలో స్పష్టంగా గమనించవచ్చు. విధినిర్వహణలో యువతితో ఇలా రాసక్రీడలు సాగించడంపై దర్యాప్తు జరిపి నివేదిక రాగానే నిందితుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సెంట్రల్ రైల్వే డివిజనల్ మేనేజరు రవీందర్ గోయల్ చెప్పారు.