అందరి కళ్ళు బాలాపూర్ లడ్డూ పైనే..ఈ సారి ఎంత పలుకుతుందో...?

SMTV Desk 2017-09-05 10:33:07  balapur ganesh, ganesh, balapur laddu bid, hyderabad ganesh

హైదరాబాద్ సెప్టెంబర్ 5: వినాయక నిమజ్జనం వచ్చిందంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది లడ్డూ వేలం పాట. హైదరాబాద్ లో ఒక్కొక్క ప్రదేశంలో లడ్డూ ఒక్కొక్క రేటు పలుకుతుంది. అయితే ఈ సమయంలో అందరి దృష్టి బాలాపూర్ గణేష్ పైనే ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కారణం ఈ లడ్డూ వేలంపాట లో అత్యధిక ధర పలకడమే. అయితే బాలాపూర్ లడ్డూ గత కొన్ని సంవత్సరాల నుండి రికార్డు స్థాయిలో ధర పలుకుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ వస్తుంది. గతంలో ఈ లడ్డూ 14.5లక్షలకు అమ్ముడైన సంగతి తెలిసిందే. అయితే దీన్ని స్కైలాబ్ రెడ్డి దీన్ని సొంతం చేసుకోవడం జరిగింది. అయితే ఈ సారి వేలంపాటలో మొత్తం 15 మంది పాల్గొన్నారు. అయితే ఈ సారి ధర ఎంత పలుకుతుందో అని ప్రజలంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. 1994 లో గణేష్ లడ్డూ రూ.450 వేలంపాట తో ప్రారంభం అయి ఇప్పుడు లక్షల్లో ధర పలికే స్థాయికి ఎదిగిందని గణేష్ ఉత్సవ కమిటీ వివరించింది. బాలాపూర్ లడ్డూని ఇప్పటివరకు బాలాపూర్ గ్రామస్తులే ఎక్కువగా దక్కించుకున్నారు. అందులో కొలన్ మోహన్ రెడ్డి కుటుంబీకులే ప్రథమ స్థానంలో ఉండటం విశేషం. ఇప్పటివరకు 19సార్లు వేలంపాట జరగ్గా ఎనిమిది సార్లు కొలన్ బ్రదర్స్ లడ్డూని దక్కించుకున్నారు.