పాట్నా, సెప్టెంబర్ 04 : గత జూలైలో లాలూ పార్టీ, కాంగ్రెస్ల నుంచి నితీశ్ వర్గం వేరు పడి బీజేపీ కూటమిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుంటున్నారంటూ లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందిస్తూ రాష్ట్రం అభివృద్ధి చేసే పనిలో తాను బిజీగా ఉన్నానని, కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి ఆలోచించే తీరిక కూడా ఉండటం లేదని నితీశ్ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తన చెప్పుచేతల్లో ఉండాలనుకున్న లాలూ తాను కూటమి నుంచి బయటికి వచ్చాక ఎలాంటి పనిలేకపోవడంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. వాటికి మాకు ఎలాంటి సంబంధం లేదు. మా దృష్టి మొత్తం ఇప్పుడు బిహార్ను అభివృద్ధి చేయడం మీదనే ఉన్నట్లు నితీశ్ వెల్లడించారు.