లక్నో, సెప్టెంబర్ 4 : ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ లోని బీఆర్డీ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో చిన్నారులు మృతి చెందిన ఘటన మరువక ముందే ఫరూఖాబాద్ లో ఇలాంటి ఘటనే మరోసారి చోటు చేసుకుంది. ఫరూఖాబాద్లోని రామ్ మనోహర్ లోహియా రాజ్కియా చికిత్సాలయలో నెలరోజుల వ్యవధిలో 49 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఆక్సిజన్, మందుల కొరత వలనే చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు (సీఎంవో), చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (సీఎంఎస్) సహా కొందరు వైద్యులపై కేసును నమోదు చేశారు.